మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 22: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో ముది రాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పెంచుతున్న చేపలు వైరస్తో భారీగా మృతి చెందా యి. సొసైటీ సభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం.. నాలుగు రోజులుగా చెరువులో కొద్దికొద్దిగా చేపలు చని పోతున్నాయి. వాటిని పరిశీలించగా చర్మంపై పుండ్లు ఏర్పడి ఎర్రగా మారా యి. చెరువులో అధికంగా పాప్లేట్ రకం చేపలకు వైట్జెల్, పారాసెల్ ఫంగస్తో కూడిన వైరస్ సోకి సుమారు రెండున్నర క్వింటాళ్ల చేపలు చనిపోయాయి. చెరువు చుట్టుపక్కల నుంచి ఎక్కువగా డ్రైనేజీ నీరు వచ్చి చేరుతున్నదని, దీంతో చేపలు వైరస్ బారినపడి ఇన్ఫెక్షన్తో చనిపోతున్నా యని సొసైటీ సభ్యులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వెంట నే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై జిల్లా మత్స్య శాఖ అధికారి బుజ్జిబాబును వివరణ కోరగా.. ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు చనిపోయాయన్నారు. ఉప్పు, పసుపు నీటిలో కలిపితే చేపలకు ఆక్సిజన్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు.