యాదాద్రి, డిసెంబర్ 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుమేరకు బీబీనగర్కు చెందిన నూలి విజయమనోహర్రావు తన కుటుంబసభ్యుల తరఫున రూ. 2,51,116 విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం యాదాద్రి బాలాలయంలో ఏఈవో గట్టు శ్రవణ్కుమార్కు అందజేశారు.