అమరావతి : ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. వైరస్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
835 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా కేసులు సంఖ్య 9,10,943కు చేరింది. 8,91,883 మంది కోలుకోగా.. మరో 11,809 యాక్టివ్ కేసులున్నాయి.
ఇవాళ్టి వరకు 7,251 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 31,657 శాంపిళ్లను పరీక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి