సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు రీ సస్టెయినబిలిటీ (రాంకీ ఎన్విరో ఇంజనీర్స్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతం రెడ్డి తెలిపారు. బిగ్ఎఫ్ఎంతో భాగస్వామ్యం చేసుకుని 15వ ఎడిషన్ బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 15వేల గణేశ్ విగ్రహాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్తో పాటు ముంబయి, బెంగుళూరు, కోల్కతా, చెన్నై నగరాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విగ్రహాలను అందుకున్న ప్రజలు తమ తమ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇంటిలోనే నిమజ్జనం చేయడం ద్వారా ఓ నూతన మొక్కకూ ప్రాణం పోయవచ్చని రీసస్టెయినబిలిటీ సీఈవో మసూద్ మల్లిక్ తెలిపారు.