హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్కు చెందిన 13 ఏండ్ల బాలిక పులకిత హస్వీ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన కిలిమంజారోను అధిరోహించింది. ‘ఇది ఎంతో సాహసోపేతమైన అనుభవం. కిలిమంజారో పర్వతంపై అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. పైగా పర్వతారోహణకు మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకోసం యోగా, మెడిటేషన్ చేసేదాన్ని. 2024కి ముందు మొత్తం ఏడు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నా’ అని ఆమె తెలిపింది.