కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అండమాన్ నికోబార్ దీవులు కొత్త రికార్డు సాధించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ దీవులు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు. దీంతో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా అండమాన్ నికోబార్ దీవులు నిలిచాయి.
#CoVIDVaccine #TheAndamanStory – 1 – A&N achieved 100% Covid vaccine coverage making it 1st State/UT to achieve the feat using only Covishield. UT Admin overcame Insurmountable odds for this extraordinary feat in one of the remotest part of world. @MediaRN_ANI @Jitendra_Narain
— Andaman and Nicobar Admn (@Andaman_Admin) December 18, 2021
అయితే వ్యాక్సినేషన్ మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సిన్తోనే పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొత్తం 2.87 లక్షల మంది అర్హులు తీసుకున్నారు. దీంతో ఆ దీవుల్లో మొత్తం 74.67 శాతం మందికి కరోనా టీకాలు అందాయి. ప్రస్తుతం అక్కడ యాక్టివ్గా రెండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని సమాచారం.
ఇప్పటికే భారత దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే.