న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నది. అయితే, మూడో దశ వ్యాప్తి ప్రస్తుతం సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. రెండో విడుతలో యువతపై ఎక్కువ ప్రభావం చూపిందన్న వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. అయితే, కరోనా మొదటి, రెండో వేవ్లో వయస్సు వారీగా తులనాత్మక అధ్యయనాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇందులో రెండు వేవ్లలోనూ పిల్లలకు కరోనా సోకినట్లు గుర్తించారు. మొదటి, రెండో వేవ్లో 1-20 మధ్య వయసున్న వారికి 12 శాతంలోపు కరోనా బారినపడ్డనట్లు కేంద్రం పేర్కొంది.
1-20 ఏజ్గ్రూప్లో సెకండ్ వేవ్లో (మార్చి15-మే25 వరకు) మొత్తం కేసుల్లో 11.62 శాతం మంది ఉన్నారని, మొదటి వేవ్లో (జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు) 11.31శాతంగా ఉందని.. రెండింట్లో పెద్దగా తేడా ఏమీ లేదని చెప్పింది. కరోనా రెండు తరంగాల్లో 21-50 ఏజ్గ్రూప్ ఎక్కువ ప్రభావితమైందని, ఇందులో మొదటి వేవ్లో 59.74శాతం మందికి, రెండో వేవ్లో 62.45శాతం మందికి వైరస్ సోకిందని పేర్కొంది. 61 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారికి మొదటి వేవ్లో 13.89శాతం, రెండో తరంగంలో 12.58 శాతంగా ఉందని తెలిపింది.
రెండు వేవ్లలో వయసుల వారీగా వివరాలను ఆరోగ్య మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వివరించారు. మూడో వేవ్ వస్తే పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందనే భయాల మధ్య, వారిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటుందని సూచించేందుకు తగిన ఆధారాలు లేవని కేంద్ర స్పష్టం చేసింది. అయితే అన్ని వయసుల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.