ఈ నెల 15న స్వస్తివాచనంతో ప్రారంభం
22న స్వామివారి తిరుకల్యాణోత్సవం
25న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు
స్వామివారి కల్యాణానికి గవర్నర్, మంత్రుల రాక
వివరాలు వెల్లడించిన ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి
యాదాద్రి, మార్చి12 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15నుంచి మార్చి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట ఈవో కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాటుపై మీడియాకు వివరాలు వెల్లడించారు. 15వ తేదీన స్వస్తి వాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభమవుతాయి. 16న ధ్వజారోహణం, భేరి పూజలు ఉంటాయన్నారు. 17 నుంచి 23వ తేదీ వరకు స్వామి వారికి వివిధ రకాల అలంకార సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న ఎదుర్కోలు, 22న స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 23 న దివ్య విమాన రథోత్సవం, 25న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరి సమాప్తి పలుకనున్నామన్నారు. గతేడాది వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ. 72 లక్షల ఖర్చు చేశామని, ఈసారి సైతం అంతేస్థాయిలో బడ్జెట్ను కేటాయించి నట్లు తెలిపారు. 60 నుంచి 70 మంది పారాయణికులు, రుత్వికులు, ఆచా ర్యులతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామ ని తెలిపారు. బహుశా బాలాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇదే చివ రిసారి అవుతుండొచ్చన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు బాలా లయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్ హాజరుకానున్నారన్నారు. సాయంత్రం కొండకింద పాత జడ్పీ హెచ్ఎస్ ఆవరణలో జరిగే కల్యాణంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్ర భుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమ ర్పించనున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ ఆలయ ఈవో, పోచంపల్లి చేనేత సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలను సమర్పించనున్నట్లు వివరించారు. ప్రధానాలయం, పురవీధులు, కొండ కింద గల ప్రధాన రహదారి, పాత బస్టాండ్తో పాటు వివిధ ప్రాంతా ల్లో డెకరేషన్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత సంవత్సరం మా దిరిగా చలువ పందిళ్లు, చక్కటి విద్యుత్ దీపాలంకరణ, సౌండ్ సిస్టం ఏర్పా టు చేయనున్నామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి కొండపై బాలాలయంలో ఈ నెల 15 నుంచి 25వ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హో మం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. 21 నుంచి 23 వరకు భక్తులచే నిర్వహించే అర్చనలు, బాలభోగాలు, 24 నుంచి 25 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాలపై సమీక్ష
యాదాద్రి వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా చేప ట్టాల్సిన పనులపై జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివా స్రెడ్డి సమీక్ష జరిపారు. ఈ మేరకు శుక్రవారం యాదగిరిగుట్ట ఈవో కా ర్యాలయంలో వివిధ వి భాగాల అధికారులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పా ట్లను చూడాలన్నారు. విద్యుత్శాఖ, రెవెన్యూశాఖ, పోలీస్, ఫైరింగ్, రవాణా శాఖ అధికారులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో సూరజ్ కుమార్, ఆలయ ఈవో గీత, డీఎంహెచ్వో సాంబశివరావు, సీఐ జానకిరెడ్డి, తహసీల్దార్ అశోక్రెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, ఆర్టీసీ డీఎం లక్ష్మారెడ్డి, విద్యుత్ ఏఈ, ఏడీఎఫ్వో తదితరులు పాల్గొన్నారు.
పాత జడ్పీహెచ్ఎస్ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న పాత జడ్పీహె చ్ఎస్ ప్రాంగణంలో జరగనున్న కల్యాణోత్సవ స్థలాన్ని కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు రాకుండా ఉత్సవాలను జరపాలని ఆలయ అధికారులకు సూ చించారు.ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నారు