ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ను కలుస్తున్న మేధావులు పదేపదే చెప్పే మాట – హి ఈజ్ ఏ గుడ్ లర్నర్. ఆయన పుస్తకాలు మాత్రమే చదువరు. సమాజాన్ని చదువుతారు. మనుషులను చదువుతారు. సమస్యలను చదువుతారు. సమస్యల మూలాలను చదువుతారు. పరిష్కారాలు సాధిస్తారు. అందుకే కేసీఆర్ నిరంతర అధ్యయనశీలి. పల్లెటూరికి పోతే అక్కడి పరిస్థితులను ఆయన అధ్యయనం చేస్తారు. ఒక పేదవాడు కనిపిస్తే, అతడి కష్టసుఖాలను, జీవన పరిస్థితులను తెలుసుకుంటారు. కాలంతో మారుతున్న పరిస్థితులను వేగంగా గ్రహిస్తారు. అతివేగంగా ఆకళింపు చేసుకోవడం ఆయనకున్న అరుదైన శక్తి. ఆయన పథకాలన్నీ ఉద్యమకాలపు అనుభవాల ఫలితమే. కల్యాణ లక్ష్మి మొదలుకొని ప్రతి పథకం వెనుక ఆయన అధ్యయనం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన ప్రవేశ పెట్టిన దళిత బంధు, రైతు బంధు వంటి ప్రతి పథకమూ తరచి చూస్తే, అంతర్జాతీయ అధ్యయనాలు, సూచనల ప్రకారం శాస్త్రీయమైనదిగా తేలుతుంది. అందుకే మన పథకాలకు ఇంతటి ప్రశంసలు, ఆసక్తి వ్యక్తమవుతున్నాయి. ఆచరణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. అనేక మంది ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు, విధానకర్తలు సమష్టిగా ఎంతోకాలం తర్జన భర్జన చేస్తే తప్ప పట్టుబడని ఈ అభివృద్ధి రహస్యాలను కేసీఆర్ ఆకళింపు చేకోవడమేమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది.
‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందా’వంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుంది. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.
– కేసీఆర్