దేవరకద్ర రూరల్/భూత్పూర్, అక్టోబర్ 18: ఆడ పడుచులు కలిగిన తల్లితండ్రుల పాలిట ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 54మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 19మంది లబ్ధిదారులకు రూ.పది లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఫర్దీపూర్లో మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని అనేక సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయన్నారు. పుట్టిన పిల్లనుంచి మొదలై కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా పీజీ వరకు ఉచిత విద్య, ఆడపడుచు పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్ష వధువు తల్లిదండ్రులకు అందజేస్తున్నదన్నారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, సర్పంచ్ మోహన్గౌడ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాము, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఫర్దీపూర్ లిఫ్ట్ కొరకు అధికారులతో సమీక్ష
చిన్నచింతకుంట మండలంలోని ఫర్దీపూర్ లిఫ్ట్ ఏర్పాటు చేస్తే మండలంలోని లాల్కోట, ఫర్దీపూర్, పల్లమర్రి, నెల్లికొండి, చిన్న వడ్డెమాన్, పెద్దవడ్డెమాన్, ఏదులాపూర్కు కొత్తగా 3500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు, సాధ్యాసాధ్యాలను అధికారులతో పరిశీలించారు. ఈ లిఫ్ట్కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ప్రతాప్సింగ్, డీఈలు చందు, చారి, సత్యనారాయణ, ఏఈఈలు శ్రీనివాస్, కిషన్, హరిందర్, సర్వేయర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
భూత్పూర్, అక్టోబర్ 18: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నా రు. భూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఎమ్మెల్యే అధికారులతో కాసేపు ఆగి మాట్లాడారు. అదేవిధం గా కల్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేశారు.