ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామ శివారులో ఉన్న గోదావరి ఇసుక తిన్నెల వద్ద శివలింగం బయటపడింది. అటుగా వెళ్లిన గ్రామస్థులకు గురువారం శివలింగం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు