padma awards | దేశ రాజధాని ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో 119 మందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పురస్కరాలు అందజేశారు. 2021 ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిలో 16 మందికి మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ సాహూను, తెలుగు సినీరంగానికి చెందిన ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. ఇక ప్రముఖ గాయని చిత్రకు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.