300 అడుగుల ఎత్తుతో వాయువ్య చైనాలోని దున్హువాంగ్ నగరంపై మంగళవారం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. 100 మీటర్ల ఎత్తుతో ఈ ఇసుక తుఫాను దూసుకొచ్చింది. దీంతో 20 అడుగుల దూరంలో కూడా ఏమున్నాయో కూడా కనిపించనంతగా ఇసుక తుఫాను కమ్మేసింది. దీనివల్ల రోడ్డుపై వెళ్తున్న 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.