క్రికెట్ అభిమానులకు ధోనీ బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో.. ఆయన హెయిర్ స్టైల్ అంటే కూడా యువతలో అంతే క్రేజ్. ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేస్తుంటాడు మాహీ.. అలాంటి ధోనీ ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు నయా లుక్లో దర్శనమిచ్చాడు. గుండుతో బుద్ధ సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ ట్విటర్లో షేర్ చేసింది. ధోనీ నయా లుక్ను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా ఇప్పుడీ ఫొటో వైరల్గా మారింది.