corona vaccine | కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉంది. ఈ క్రమంలో గురువారం సూర్యాపేట జిల్లా వల్లాపురంలో గడ్డివాముల వద్దకు వెళ్లి మరి వైద్యారోగ్య శాఖ సిబ్బంది వ్యాక్సిన్లు వేశారు.