BS Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిబ్రవరిలో యడ్యూరప్ప తన కూతురుని లైంగికంగా వేధిండాని ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్లో పోలీస్స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, యడ్యూరప్పపై ఆరోపణలు చేసిన మహిళ ఆదివారం మృతి చెందింది.
సదరు ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతోందని.. ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతుంది. క్యాన్సర్ మరింత ముదరడంతో ఆమె కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో, 354 (ఎ) ఐపిసి కింద కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న జరిగిన సమావేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మహిళ ఫిర్యాదు ఆధారంగా మాజీ సీఎం యడ్యూరప్పపై మార్చి 14న సదాశివనగర్ పోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఐపీసీ సెక్షన్ 354 ఏ (లైంగిక వేధింపు) కింద కేసు నమోదు చేశామన్నారు. కేసు నమోదైన కొద్ది గంటల డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.