బెంగళూరు, జూలై 22: పరివార్వాద్, కుటుంబపాలన.. అంటూ ఇతరులపై విమర్శలు చేసే బీజేపీ నేతలు పలువురు వారసులను తయారు చేసే పనిలోపడ్డారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్పకూడా అదే పనిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ఆయన ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర నియోజకవర్గం నుంచి తన కుమారుడు విజేంద్ర పోటీ చేస్తాడని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలువాలని కోరారు.