న్యూఢిల్లీ, జూన్ 10: లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో రాజీకి రావాలని బ్రిజ్ భూషణ్ సన్నిహితులు తమను ఒత్తిడి చేస్తున్నారని స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపించారు. రెజ్లర్ల భవిష్యత్ కార్యాచరణపై శనివారం సోనిపట్లో జరిగిన మహా పంచాయత్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒత్తిడి కారణంగానే మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని తెలిపారు. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆసియా క్రీడల్లో పాల్గొనబోమని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 15లోగా బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.