డెహ్రాడూన్: సిల్కియారా టన్నెల్(Uttarakhand Tunnel)లో చిక్కుకున్న కార్మికులు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సొరంగంలోకి రెస్క్యూ బృందాలు పైప్లైన్ను పూర్తిగా దించేశారు. అమర్చిన పైప్లైన్ ద్వారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు లాగనున్నారు. ఆ టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. వర్కర్లు అందర్నీ రెస్క్యూ చేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కార్మికులకు తక్షణ వైద్యం సహాయం అందించేందుకు సైట్ వద్దకు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. గత 17 రోజుల నుంచి సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే.
#WATCH | Uttarkashi tunnel rescue | Preparations complete at Community Health Center Chinyalisaur for the treatment of 41 workers who will be brought here after they are rescued and brought out of Silkyara tunnel. pic.twitter.com/MZJUZ8F0x8
— ANI (@ANI) November 28, 2023