గూర్గావ్: పెంపుడు కుక్క కరిచిన కేసులో మహిళా బాధితురాలికి రెండు లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ గూర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్కు జిల్లా వినియోగదారుల ఫోరమ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఆగస్టులో ఈ ఘటన జరిగింది. కావాలంటే ఆ డబ్బును కుక్క ఓనర్ నుంచి రికవరీ చేయవచ్చు అని వినియోగదారుల ఫోరమ్ తన ఆదేశాల్లో పేర్కొన్నది. గూర్గావ్లో ఇండ్లల్లో పని మనిషిగా చేస్తున్న మున్ని అనే బాధితురాలు ఓ ఇంటి పనికి వెళ్తున్న సమయంలో స్థానికంగా ఉండే వినీత్ చికారా అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఆ మహిళను కరిచింది. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.
గుర్గావ్లో ఉన్న సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఆ ఎఫ్ఐఆర్లో కుక్క బ్రీడ్ను పిట్బుల్గా చేర్చారు. కానీ ఆ తర్వాత ఓనర్ ఆ బ్రేడ్ను డాగో అర్జెంటినోగా పేర్కొన్నారు. అయితే ఆ శునకాన్ని కస్టడీలోకి తీసుకోవాలని, డాగ్ ఓనర్ లైసెన్సును కూడా రద్దు చేయాలని ఫోరమ్ ఆదేశించింది. డాగో అర్జెంటీనో జాతి కుక్కపై నిషేధం ఉంది. దానితో పాటు మొత్తం 11 రకాల బ్రీడ్లు పెంపుడు కుక్కల జాబితాలో లేవు.