లక్నో: మహిళ, ఆమె కుమార్తె, కుమారులు కాల్పుల్లో మరణించారు. (Woman, Daughter, Sons Shot Dead ) ఇంట్లోని బెడ్ రూమ్స్లో వారి మృతదేహాలను పోలీసులు గమనించారు. గంట తర్వాత నిర్మాణ స్థలం వద్ద ఆమె భర్త మృతదేహాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులను గన్తో కాల్చి చంపి ఆ తర్వాత కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. భదాయిని ప్రాంతంలో నివసించే రాజేంద్ర గుప్తా ఇంటి తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకోలేదు. ఆ ఇంట్లోకి వెళ్లి చూసిన పని మనిషి షాక్ అయ్యింది. రాజేంద్ర గుప్తా భార్య 45 ఏళ్ల నీతూ, పిల్లలైన 25 ఏళ్ల నవనీంద్ర, 16 ఏళ్ల గౌరాంగి, 15 ఏళ్ల ఏళ్ల శుభేంద్ర గుప్తా కాల్పుల గాయాలతో మరణించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంట తర్వాత ఒక నిర్మాణ స్థలం వద్ద రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిద్రిస్తున్న భార్య, పిల్లలను కాల్చి చంపిన తర్వాత అతడు కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజేంద్ర గుప్తా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండో భార్య అయిన నీతూతో గొడవ వల్ల ఆమెతోపాటు పిల్లలను చంపినట్లు అనుమానిస్తున్నారు. అయితే రాజేంద్రకు సుమారు పది ఇళ్లు ఉన్నాయని, నెలకు లక్షల్లో అద్దె వస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి వివాదం కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు.