న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. రోజురోజుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా కేంద్రాల సంఖ్యను పెంచారు. దాంతో గడిచిన 24 గంటల వ్యవధిలోనే కొత్తగా దేశంలో 31.14 లక్షల మందికి టీకాలు ఇవ్వగలిగారు. ఈ 31 లక్షల మందితో కలిపి ఇప్పటివరకు దేశంలో మొత్తం 63.43 లక్షలకు పైగా డోసుల టీకాలు ఇచ్చినట్లయ్యింది.
సోమవారం ఉదయం ఏడు గంటల వరకు అందిన ప్రొవిజినల్ రిపోర్టు ప్రకారం తాజా వివరాలను వెల్లడించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.