న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై న్యాయపోరాటం కొనసాగిస్తానని (Will continue legal battle) పరువునష్టం దావా వేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ తెలిపారు. అయితే జైలు శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని ఆయన అన్నారు. అలాగే రాహుల్ గాంధీ పిటిషన్ను తిరస్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2019 ఏప్రిల్13న కర్ణాటకలోని కోలార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారని, తమ వర్గాన్ని కించపరిచారని పూర్ణేష్ మోదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్కు వ్యతిరేకంగా సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మార్చిలో ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష విధించిందని చెప్పారు.
కాగా, ఈ శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ సూరత్ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారని గుజరాత్ మాజీ మంత్రి అయిన పూర్ణేష్ మోదీ తెలిపారు. న్యాయం తమ పక్షాన ఉందని, అందుకే ఆయన పిటిషన్ను ట్రయల్ కోర్టుతోపాటు హైకోర్టు కూడా తిరస్కరించిందని చెప్పారు. అయితే శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నానని మీడియాతో ఆయన అన్నారు.
మరోవైపు మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆయన ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, సంజయ్ కుమార్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
#WATCH | "Today, SC has stayed Rahul Gandhi's conviction. We welcome this verdict given by the court. We will continue our legal battle in the court," BJP MLA Purnesh Modi, who filed a defamation case against Congress leader Rahul Gandhi. pic.twitter.com/Zf4NGYI1La
— ANI (@ANI) August 4, 2023