కోల్కతా: ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం పైలట్లపై లేజర్ లైట్ పడింది. (Laser light) దీంతో దృష్టి అంతరాయాన్ని వారు ఎదుర్కొన్నారు. విమానం ల్యాండ్ తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులను అలెర్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఇండిగో ఫ్లైట్ 6ఈ 223 బెంగళూరు నుంచి కోల్కతా చేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో బలమైన లేజర్ లైట్ కిరణాలు విమానం కాక్పిట్లోకి వచ్చాయి. దీంతో ఆ కాంతి వల్ల పైలట్, కో-పైలట్ దృష్టికి స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు వారి కళ్లు కనిపించలేదు.
కాగా, విమానం ల్యాండింగ్ తర్వాత ఇండిగో పైలట్లు ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు తెలిపారు.
తీవ్రమైన భద్రతా సమస్యగా గుర్తించిన అధికారులు వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసు అధికారులు వెంటనే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లేజర్ లైట్ కిరణాలను ఆపారు. అయితే ఈ సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.