పట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరుపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆయన అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతాడని, ఆయన మాటలను తాను పట్టించుకోనని అన్నారు. శనివారం బీహార్లో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా ప్రసంగంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా.. నితీశ్ కుమార్ పైవిధంగా స్పందించారు.
‘అలాంటివి పట్టిచుకోవద్దు. నేను వాళ్లకు (బీజేపీ నేతలకు) సంబంధించిన ఏ విషయాన్ని పట్టించుకోను. ఆయన (అమిత్ షా) ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతాడు. నోటికొచ్చిన ఆరోపణలు చేస్తాడు. బీహార్ అభివృద్ధిపై ఆయనకు కాస్తైనా అవగాహన ఉన్నదా..? ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..? అని నితీశ్ మీడియాను ప్రశ్నించారు.
#WATCH | On Union Home Minister Amit Shah’s public address in the state today, Bihar CM Nitish Kumar says, “Don’t pay attention to it. I don’t pay attention to anything of theirs. When he comes, he speaks nonsense. Does he have any knowledge of Bihar’s development and how much… pic.twitter.com/7YJX2M61AF
— ANI (@ANI) September 16, 2023