న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత్ సహా 150 దేశాల్లో త్వరలో వాట్సాప్ చానల్స్ అందుబాటులోకి తెస్తున్నామని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. వివిధ రంగాల్లో సెలబ్రటీలు, ఇతర సంస్థల్ని ఫాలో అయ్యేవాళ్లకు ఈ వాట్సాప్ చానల్స్ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయని, మెటా న్యూస్, అప్డేట్స్ను పంచుకోవటం ద్వారా వాట్సాప్ ఛానల్స్ను ప్రారంభిస్తున్నానని జుకర్బర్గ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో ఈ చానల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతాయని, ఎవ్వరైనా తమ చానల్ను క్రియేట్ చేసుకోవచ్చునని జుకర్బర్గ్ తెలిపారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని ఫీచర్స్ ఇందులో జోడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన అధికారిక వాట్సాప్ చానల్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.