న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఝార్గ్రామ్ బీజేపీ ఎంపీ కునార్ హెంబ్రామ్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. రాజీనామా తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇకపై తాను రాజకీయాల్లో ఉండదల్చుకోలేదని వెల్లడించారు.
తన బదులు మరొకరు ఎంపీగా అవకాశం దక్కించుకోవటానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నానని చెప్పారు.