ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులంతా చేరుకున్నారు. అతిథులకు మంచి బిర్యానీతో డిన్నర్ ఆర్డర్ చేశారు. పెళ్లితంతు అంతా సవ్యంగానే సాగుతోంది. అయితే, ఇంతలో ఊహించని ఘటన. పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. బిర్యానీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇదంతా జొమాటో నిర్లక్ష్యంతోనే జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తమిళనాడులోని ఒరతనాడులో పెళ్లికి నాన్ వెజ్ బిర్యానీ కోసం ఆర్డర్ ఇచ్చారు. జొమాటో 3,500 కిలోల మాంసాన్ని సరఫరా చేసింది. బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్ని పార్శిల్ చేసింది. అయితే, ఆన్లైన్ ఆర్డర్లో టన్నుల కొద్దీ కుళ్లిన మాంసం రావడంతో పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తనిఖీలు నిర్వహించిన అధికారులు అది కుళ్లిన మాంసమేనని తేల్చారు. దీనిపై జొమాటో వివరణ ఇవ్వాలని సేలం ఆర్ఆర్ బిర్యానీనోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, వచ్చిన బంధువులకు భోజనం పెట్టకుండా పెళ్లి జరిపించలేమని, బిర్యానీ లేకపోవడంతోనే పెళ్లి వాయిదావేసుకున్నామని వధూ వరుల కుటుంబ సభ్యులు తెలిపారు.