జలంధర్: ఫెడరలిజాన్ని తాము గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్లోని జలంధర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థలో భాగంగానే మాజీ సీఎం అమరీందర్ సింగ్ తమ ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్లు ప్రధాని తెలిపారు. పంజాబ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. నవ పంజాబ్ రుణ విముక్తి అవుతుందన్నారు. అయితే ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వం తనకు భద్రత కల్పించడంలో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. త్రిపురమాలిని దేవి శక్తిపీఠానికి వెళ్లాలని అనుకున్నానని, కానీ ప్రభుత్వం, పోలీసులు భద్రత కల్పించలేకపోయినట్లు ఆయన తెలిపారు. అయితే త్వరలోనే ఆ శక్తిపీఠం వద్ద పూజలు చేయనున్నట్లు మోదీ తెలిపారు. క్రిమిసంహారకాలు, ఫెర్టిలైజర్స్ను గ్లోబల్ మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకే అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. సహజ, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. 23 లక్షల మంది పంజాబీ రైతులకు పీఎం కిసాన్ పేమెంట్ అందుతోందన్నారు.