మథుర: అలనాటి అందాల నటి, బీజేపీ నాయకురాలు, మథుర ఎంపీ హేమామాలని భజన గీతం ఆలపించారు. బృందావన్లోని రాధా రమణ్ ఆలయంలో హేమామాలని వేదికపైకి వెళ్లి హరే కృష్ణ, హరే కృష్ణ అంటూ భజన గీతం చెబుతుండగా.. ఆలయానికి వచ్చిన ఇతర భక్తులు వంతపాడారు.
ఈ ఉదయం రాధా రమణ్ ఆలయానికి వెళ్లిన హేమామాలిని ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భజన గీతాలపన జరుగుతుండగా అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత తనూ వేదికపైకి వెళ్లి ఒక పాడారు. హేమామాలిని పాడినపాటను కింది వీడియోలో మీరూ ఒకసారి వినండి.