లక్నో: ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు మన దేశంలో సందడి చేస్తుంటాయి. నదులు, సరస్సులకు కొత్త అందాలను తీసుకొస్తాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణంలో వలస పక్షుల సందడి కొనసాగుతున్నది. ప్రయాగ్రాజ్లోని పుష్కర ఘాట్లకు వలస పక్షుల గుంపులు చేరుకున్నాయి.
వలస పక్షుల రాకతో ప్రయాగ్రాజ్లోని సంగమ్ ఏరియాలో గంగానది నూతన అందాలను సంతరించుకున్నది. ప్రయాగ్రాజ్కు వచ్చే యాత్రికులకు ఈ వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. మరి ఆ వలస పక్షుల అందాలను మీరు వీక్షిస్తారా..? అయితే కింది వీడియోపై ఓ లుక్కేయండి..
#WATCH | Uttar Pradesh: Hundreds of migratory birds flock to the ghats of Prayagraj town as they arrived at Sangam providing a beautiful sight on the waters of river Ganga. pic.twitter.com/uiBfbiqDqt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 12, 2023