న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కాదని, ఈ సభలో ఉన్న అన్ని పార్టీలు అదే డిమాండ్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్నవాళ్లమంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమని, ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఖర్గే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చైర్మన్ ధనకర్ను ఉద్దేశించి ఖర్గే.. ‘మీరు నాతో ఒక విషయం చెప్పారు. వారితో చెప్పారో లేదో (హోంమంత్రి అమిత్షాను చూపుతూ).. అమిత్ షాకు చెప్పకపోయారా..’ అన్నారు. ఈ సందర్భంగా సభ్యుల ముఖాల్లో నవ్వులు చిగురించాయి.
‘మీరు నాతో.. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలో డబ్బులు చేతితో లెక్కబెట్టేవాడినని, ఇప్పుడు సంపద పెరగడంతో మిషన్తో లెక్కబెడుతున్నానని చెప్పారు’ అని చైర్మన్ను ఉద్దేశించి ఖర్గే అనగానే ధన్కర్ ‘లేదు లేదు నేను ఆ మాట చెప్పలేదు’ అంటూ కంగారుపడ్డంత పనిచేశారు. ‘మీ వాలకం చూస్తుంటే నాపై జేపీసీ వేయించేలా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని సహా సభ్యులంతా గొల్లున నవ్వారు.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar in exchange with LoP Mallikarjun Kharge who is demanding JPC on the Adani issue says, “it seems you will set up a JPC on me.”
(Video source: Sansad TV) pic.twitter.com/hGEt7oPeGz
— ANI (@ANI) February 8, 2023