సిలిగురి: పశ్చిమబెంగాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్కు నిరసన సెగ తగిలింది. వెస్ట్ బెంగాల్ తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP)కు చెందిన సభ్యులు గవర్నర్ కాన్వాయ్ వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించారు. ఇవాళ (బుధవారం) గవర్నర్ ఆనందబోస్ సిలిగురి జిల్లాలోని నార్త్ బెంగాల్ యూనివర్సిలో వైస్ ఛాన్సెలర్లతో సమావేశం కోసం వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం వైస్ ఛాన్సెలర్లతో సమావేశంలో గవర్నర్ సీవీ ఆనందబోస్ ఈ నిరసన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు అనేవి ధర్మబద్దమేనని, నిరసనలు స్వాగతించదగినవి అని గవర్నర్ వ్యాఖ్యానించారు. అయితే, దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో బెంగాల్ యూనివర్సిటీలు ఉన్నతమైనవిగా ఉండాలన్నదే తమ ఎజెండా అని ఆయన చెప్పారు.
కాగా, గవర్నర్ ఆనందబోస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా రాజ్భవన్ నుంచి తన సొంత పాలన చేస్తున్నారని తృణమూల్ విద్యార్థి పరిషత్ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన ఏకపక్షంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమించారని విమర్శించారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగానే ఇవాళ తాము నిరసన తెలిపామన్నారు.
#WATCH | Members of West Bengal Trinamool Chhatra Parishad show black flags to Governor CV Ananda Bose at North Bengal University, Siliguri.
Governor has arrived here to hold a meeting with Vice Chancellors. pic.twitter.com/OZR6oAN6qA
— ANI (@ANI) June 28, 2023
#WATCH | “Protests are the essence of democracy. Protests are welcome,” says West Bengal Governor CV Ananda Bose on black flags shown to him by Members of West Bengal Trinamool Chhatra Parishad at North Bengal University, Siliguri today.
“We had one-point agenda that… pic.twitter.com/ji3ovewE6g
— ANI (@ANI) June 28, 2023