Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్లో ప్రవేశించనుంది.
కాగా, అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇప్పటికే రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుత బెంగాల్లో ఉన్న రాహుల్గాంధీ యాత్ర మరికాసేపట్లో హరిపూర్కు చేరుకోవడం ద్వారా జార్ఖండ్లో ప్రవేశించనుంది.
#WATCH | Congress MP Rahul Gandhi’s ‘Bharat Jodo Nyay Yatra’ underway in West Bengal’s Birbhum, to enter Jharkhand at Hiranpur later today pic.twitter.com/FUI3xjHjMz
— ANI (@ANI) February 2, 2024