లక్నో: అయోధ్యలో ఘనంగా దీపావళి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై పలు పౌరానిక నాటకాలు వేసి అలరించారు. ఈ ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాయణ నాటకంలో భాగంగా రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వేషధారణలో ఉన్న కళాకారులకు యోగీ పూలమాలలు వేసి సత్కరించారు.
అంతేగాక ఈ సాయంత్రం అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనున్నారు. మొత్తం 13 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పనున్నారు. కాగా, దీపావళి ఉత్సవాల్లో యోగీ ఆదిత్యనాథ్ కళాకారులకు పూలమాలలు వేసి సత్కరించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.