న్యూఢిల్లీ: ఇటీవల తూటా గాయాలకు గురై గురువారం ప్రాణాలు కోల్పోయిన సైనిక జాగిలం జూమ్కు తోటి జాగిలాలు ఘనంగా నివాళులు అర్పించాయి. 29 ఆర్మీ డాగ్ యూనిట్కు చెందిన సైనికులు జూమ్ డెడ్ బాడీని ఓ పేటికలో పెట్టి పూలతో అలంకించారు. దాని మీద జూమ్ ఫొటోను, జాతీయజెండాను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత యూనిట్లోని ఇతర జాగిలాలను అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ వారు జూమ్కు తుది వందనం చేస్తూ.. దాని తోటి జాగిలాలతో కూడా చేయించారు. ఈ విధంగా జూమ్ తోటి జాగిలాలు, సైనికుల నుంచి ఘన నివాళ్లు అందుకుంది. ఆర్మీ డాగ్ జూమ్ ఈ నెల 9న జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఓపీ తంగ్పవా వద్ద తూటా గాయాలకు గురైంది.
దాంతో జూమ్ను వెంటనే శ్రీనగర్లోని 54 AFVH (అడ్వాన్స్ ఫీల్డ్ వెటెరినరీ హాస్పిటల్)లో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే గురువారం జూమ్ ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో యూనిట్కు సంబంధించిన జాగిలాలు, సైనికులు జూమ్కు ఘనంగా నివాళులు అర్పించారు.
#WATCH | 29 Army Dog Unit pays tributes to Indian Army Dog ‘Zoom’ in Jammu. He passed away yesterday at 54 AFVH (Advance Field Veterinary Hospital) in Srinagar where he was under treatment after sustaining two gunshot injuries in Op Tangpawa, Anantnag, J&K on 9th Oct. pic.twitter.com/0nlU7Mm7Ti
— ANI (@ANI) October 14, 2022
#WATCH | Army’s Tribute To Military Dog ‘Zoom’, Who Died Fighting Terrorists https://t.co/19mSb7KCDO pic.twitter.com/Bu9b8RCyWX
— NDTV (@ndtv) October 14, 2022