హైదరాబాద్ : వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( VIT ) ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 15 దేశాల విద్యార్థులు హాజరయ్యారు. లక్ష లోపు ర్యాంకు వచ్చిన వారు కౌన్సెలింగ్కు అర్హులని అధికారులు తెలిపారు.
లక్షకు పైగా ర్యాంకులు వచ్చిన వారికి VIT-AP, VIT Bhopal లో మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 21 నుంచి జులై 16వ తేదీ వరకు నాలుగు దశల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తదితర వివరాల కోసం https://admissionresults.vit.ac.in/viteee వెబ్సైట్ను సందర్శించొచ్చు.