లక్నో, మార్చి 19: దేశంలో వీవీఐపీ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన యూపీలోని అమేథిలో రోడ్లు సరిగా లేక వివిధ గ్రామాల ప్రజలు అవస్థ పడుతున్నారు. గౌరీగంజ్ తహశిల్ పరిధిలోని కుగ్రామం ‘సర్మెనీ’ ప్రజలు గ్రామం బయట ‘నో రోడ్.. నో ఓట్’ అంటూ బ్యానర్లు కట్టారు. లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామాన్ని సమీప ప్రాంతాలకు కలుపుతూ 7 చిన్న రోడ్లు ఉన్నాయని, అవన్నీ అధ్వానస్థితిలో ఉన్నాయని గ్రామస్థుడు ఓం ప్రకాశ్ ఓజా చె ప్పారు. తాగునీరు, మురుగునీటి పా రుదల.. వంటి వసతులు లేవు. రోడ్డు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికల్ని బహిష్కరిస్తాం’ అంటూ ఓజా చెప్పారు.