న్యూఢిల్లీ: నేవీ కొత్త చీఫ్గా వైస్ అడ్మిరల్ హరి కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 30 నెలలు నేవీ చీఫ్గా ఉన్న అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. ముంబైలోని వెస్ట్రన్ నేవల్ కమాండ్కు నాయకత్వం వహిస్తున్న 59 ఏండ్ల వైస్ అడ్మిరల్ హరి కుమార్ను తదుపరి నేవీ చీఫ్గా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటించింది. 1962 ఏప్రిల్ 12న జన్మించిన ఆయన 1983 జనవరి 1న నౌకాదళం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి ప్రవేశించారు. 39 ఏండ్లుగా నేవీలోని పలు కమాండ్లలో పని చేశారు.
విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ (సేవలో లేదు), ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌకలను హరి కుమార్ కమాండ్ చేశారు. సముద్ర థియేటర్ కమాండ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని నేవల్ వార్ కాలేజ్, మోవ్ ఆర్మీ వార్ కాలేజ్, బ్రిటన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో కోర్సులను అభ్యసించారు.