న్యూఢిల్లీ: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. నాట్య సంప్రదాయాలకు చక్కని అభియనం జోడించారని చెప్పారు. పది భాషల్లో వందలాది చిత్ర గీతాలకు నృత్యరీతులు సమకూర్చారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
‘ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ పరమపదించారని తెలిసి విచారించాను. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు వారు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవి.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విటర్లో పోస్టు చేశారు.