న్యూఢిల్లీ : ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమావేశమయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు సైతం సమావేశానికి హాజరయ్యారు. సమావేశాల్లో ప్రభుత్వం తన శాసన ఎజెండాను కొనసాగించాలని యోచిస్తుండగా.. విపక్షాలు మాత్రం పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రో, డీజిల్ ధరలు, కరోనా నియంత్రణ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదేసేందుకు సిద్ధమవుతున్నాయి.