బెంగళూరు కమోండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యంపై ఆయన తండ్రి కల్నల్ కేపీ సింగ్ స్పందించారు. కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులున్నాయని వెల్లడించారు. అయితే తన కుమారుడు కచ్చితంగా విజయం సాధిస్తాడని, ఓ యోధుడిలా తిరిగొస్తాడని కల్నల్ కేపీ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ”నా కుమారుడి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులున్నాయి. కానీ ఆయన విజేతగా తిరిగి వస్తాడు. ఆయన ఓ పోరాట యోధుడు. ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగొస్తాడు. పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగొస్తాడు” అని ఆయన తండ్రి కల్పల్ కేపీ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్తో సహా 13 మంది ఆర్మీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. మొదట విల్లింగ్టన్లోని ఆర్మీ ఆస్పత్రిలో మొదట చికిత్సనందించారు. ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను బెంగళూరులోని కమోండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.