సాగర్ (మధ్యప్రదేశ్), నవంబర్ 12: క్యాంపస్లో విద్యార్థుల హాస్టళ్ల తరహాలో గోవుల కోసం కూడా ఒక పెద్ద షెల్టర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ డాక్టర్ హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ సూచన చేశారు. ఈ ప్రాజెక్టుకు తన మంత్రిత్వ శాఖ సహకరిస్తుందని పేర్కొన్నారు. దేశ సంప్రదాయం ప్రకారం పశువులే మన సంపదకు కొలమానమని, ఇది మనల్ని సర్వతోముఖాభివృద్ధికి తీసుకెళ్తుందని చెప్పారు. యూనివర్సిటీలో ‘కామధేను అధ్యయన్ అండ్ సోద్పీఠ్’ను ఏర్పాటు చేయడాన్ని రూపాలా ప్రశంసించారు.