న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముంబై-గాంధీనగర్ మధ్య ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్వే రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. మొన్న బర్రెలు ఢీకొనడంతో రైలు ముందుభాగం ఊడిపడగా.. తాజాగా ఆవును ఢీకొనడంతో రైలు ముందు బంపర్కు భారీ నొక్కుపడింది.
గుజరాత్లోని ఆనంద్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైలును పది నిమిషాల పాటు నిలిపివేశారు. కాగా, గురువారం ముంబై -గాంధీనగర్ వెళ్తుండగా వందేభారత్ రైలును నాలుగు బర్రెలు ఢీకొట్టగా, ట్రైన్ ముందు పార్ట్ ఊడివచ్చిన విషయం తెలిసిందే. ఆ బర్రెల యజమానులపై శుక్రవారం అధికారులు కేసు నమోదు చేశారు. మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ రైలు చిన్న ప్రమాదానికే దెబ్బతిన్నదంటూ సోషల్మీడియా వేదికగా నెటిజన్లు విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన 5 రోజులకే ప్రమాదానికి గురైన నేపథ్యంలో ‘వందేభారత్ రైలు’ కంటే ‘వన్డే భారత్ ట్రైన్’ అని పేరు పెడితే బాగుండేదని చురకలంటిస్తున్నారు.