హరిద్వార్, సెప్టెంబర్ 23: ఉత్తరాఖండ్ బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ దారుణానికి ఒడిగట్టాడు. తన రిసార్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని హత్య చేసి.. కెనాల్లో పడేశాడు. పైగా, ఆమె మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హరిద్వార్ జిల్లాయంకేశ్వర్లో పుల్కిత్ నడుపుతున్న రిసార్టులో పౌరి గర్వాల్ (19) పనిచేస్తున్నది. గత సోమవారం ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయటంతో హత్య చేశానని ఒప్పుకొన్నాడు. అతడిని, సహకరించిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వినోద్ ఆర్య గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మంత్రి హోదా ర్యాంకు అనుభవిస్తున్నారు.