పెద్దమందడి, ఏప్రిల్ 11: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వేరుశనగ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మే మొదటి వారంలో సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జిల్లాలో నాణ్యమైన వేరుశనగ సాగవుతున్నందున పరిశోధన కేంద్రం ఉంటే ఇంకా మంచి రకాలైన వంగడాలను అందించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.