న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 25 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి మే 25 ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధన అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.