చమోలీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఇవాళ మంచు చరియలు(Badrinath Avalanche) విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో సరిహద్దు రహదారుల సంస్థకు చెందిన సుమారు 50 మంది వరకు ఆ కొండచరియల్లో చిక్కుకున్నారు. బద్రీనాథ్ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్డర్ గ్రామం మానా వద్ద ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటన పట్ల స్పందించారు. ఆ ఘటన బాధాకరమన్నారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్ వేగంగా చేపట్టినట్లు వెల్లడించారు. కార్మికులు క్షేమంగా ఉండాలని ఆయన భగవాన్ బద్రీనాథ్ను ప్రార్థించారు.
जनपद चमोली में माणा गांव के निकट BRO द्वारा संचालित निर्माण कार्य के दौरान हिमस्खलन की वजह से कई मजदूरों के दबने का दुःखद समाचार प्राप्त हुआ।
ITBP, BRO और अन्य बचाव दलों द्वारा राहत एवं बचाव कार्य संचालित किया जा रहा है।
भगवान बदरी विशाल से सभी श्रमिक भाइयों के सुरक्षित होने की…
— Pushkar Singh Dhami (@pushkardhami) February 28, 2025
మొత్తం 57 మంది వర్కర్లు మంచు చరియల్లో చిక్కుకున్నారు. దీంట్లో ఇప్పటి వరకు 16 మందిని రక్షించారు. మానా గ్రామంలోని ఆర్మీ క్యాంపుకు వాళ్లను చేర్చారు. గురువారం రాత్రి బీఆర్వో క్యాంపులో 57 మంది రోడ్డు కార్మికులు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్కు చెందిన ఫోటోలను రిలీజ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 65 మంది వరకు పాల్గొన్నారు. కొన్ని గంటల నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే తీవ్రమైన మంచు తుఫాన్ వల్ల .. రెస్క్యూ చర్యలకు ఆటంకం కలుగుతోంది. బలమైన గాలితో పాటు అధిక స్థాయిలో మంచుకురుస్తోంది. రోడ్లన్నీ మూసుకుపోయాయి. స్నో కట్టర్లతో రోడ్లను ఓపెన్ చేస్తున్నారు.
An avalanche struck a GREF Camp near Mana village in Garhwal Sector. A number of labourers are feared to be trapped. Indian Army’s IBEX BRIGADE swiftly launched rescue operations inspite of continuing heavy snowfall and minor avalanches. So far 10… pic.twitter.com/adVcAu9g4g
— SuryaCommand_IA (@suryacommand) February 28, 2025