న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : అమెరికా వీసా రెన్యూవల్ చేసుకోవాలనుకొనేవాళ్లు తమ దరఖాస్తులను డ్రాప్బాక్స్లో వేయాలని ఆ దేశ ఎంబసీ తెలిపింది. అయితే, ఈమెయిల్ ద్వారా అభ్యర్థనలను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్ కాన్సులేట్ జనరల్-ముంబైలోని కాన్సులర్ చీఫ్ జాన్ బలార్డ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది భారతీయ విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వీసాలు స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నట్టు పేర్కొన్నారు.