న్యూఢిల్లీ: చరిత్రలో మొదటిసారిగా అమెరికా ప్రజాప్రతినిధుల సభను సిక్కు ప్రార్థనలతో ప్రారంభించారు. శుక్రవారం సభా కార్యక్రమాల నిర్వహణకు ముందు తొలుత సిక్కులు ప్రార్థన చేశారు. యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా సమావేశాన్ని సిక్కు ప్రార్థనతో ప్రారంభిస్తున్నామని, ఇది మనకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులందరికీ సంతోషకరమైన సందర్భమని ప్రార్థనలు నిర్వహించిన జ్ఞాని జశ్వీందర్ సింగ్ తెలిపారు. అనంతరం సిక్కు సమన్వయ కమిటీ ప్రతినిధి హర్జీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యుల కోసం ఆశీర్వాదాలు కోరినట్టు చెప్పారు.